శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
![]() | 867. క్షిప్ర ప్రసాదిని | ![]() |
త్వరగా అనుగ్రహిస్తుంది.ఈ దయాసముద్రయైన జగన్మాత , తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తుంది. తత్ క్షణమే. ‘భవాని త్వం దాసే మయివితర దృష్టి స్సకరుణా’ అన్నారు శంకరులు. ‘అమ్మా! భవానీ! ఈ దాసుడిపై కరుణా దృష్టిని ప్రసరించు’ అని అడిగిన వెంట్టనే తీరుస్తుంది అని ఈ నామ మహిమను తెలిపారు. కల్పతరువైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 తల్లి దృష్టి మన యందు నిలవాలి అని వేడుకుందాము 🌺 |